మహిళలను బ్లాక్ మొయిల్.. రూ.1.30 కోట్లు మోసం చేసిన వ్యక్తి.. రిమాండ్కు తరలించిన ఫిలింనగర్ పోలీసులు

మహిళలను బ్లాక్ మొయిల్..  రూ.1.30 కోట్లు మోసం చేసిన వ్యక్తి.. రిమాండ్కు తరలించిన ఫిలింనగర్ పోలీసులు

మహిళలను ట్రాప్​ చేసి బ్లాక్​ మెయిల్​  మోసం చేసే కేటుగాడిని పోలీసులు పట్టుకున్నారు. ఫిలిం నగర్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రానా ప్రతాప్​ అనే వ్యక్తి పబ్స్​కు వెళ్లే అమ్మాయిలను టార్గెట్​ చేసేవాడు. అలా ఇన్నోసెంట్​ గా ఉన్న అమ్మాయి కనిపిస్తే చాలునెమ్మదిగా మాటలు కలిపి ట్రాప్​ చేసేవాడు.. కల్లబొల్లి కబుర్లతో మాయమాటలు చెప్పి  నమ్మకంగా లోబర్చుకొని తరువాత తన కోరిక తీర్చాలని బ్లాక్​ మెయిల్​ చేసేవాడు. 

అంతేకాదు.. అలా మహిళలను అందినంత డబ్బు దోచుకొనేవాడు. ఓ యువతిని మోసం చేసి  రూ. 1.30 కోట్లు దోచుకున్నాడు.  తాను మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన మహిళ  ఫిలింనగర్​ పోలీసులను ఆశ్రయించింది.  బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నిందితుడు రానా ప్రతాప్​ ను రిమాండ్​కు తరలించారు.