అయోధ్య రామాలయం ప్రాంతంలో నాన్ వెజ్ బ్యాన్ : హోటళ్లల్లోనే కాదు ఆన్ లైన్ ఆర్డర్లూ నిషేధం

అయోధ్య రామాలయం ప్రాంతంలో నాన్ వెజ్ బ్యాన్ : హోటళ్లల్లోనే కాదు ఆన్ లైన్ ఆర్డర్లూ నిషేధం

అయోధ్యలోని ఆధ్యాత్మిక  ప్రదేశాల పవిత్రతను కాపాడటానికి  ఉత్తరప్రదేశ్  కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తిగా మాంసాహారం అమ్మకాలను నిషేధించింది.  రాంపథ్, ధర్మపథ్, భక్తిపథ్, పంచ-కోసి పరిక్రమ మార్గ్  ప్రాంతాల్లో ఆధ్మాత్మికతను కాపాడాలని  నిర్ణయించింది. రామజన్మభూమి అయోధ్యను పవిత్రతను కాపాడేందుకు యూపీ ప్రభుత్వం  కీలక నిర్ణయం తీసుకుంది.  

 మాంసాహార రెస్టారెంట్లు.. హోటళ్లే కాకుండా ఆన్​ లైన్​ ఫుడ్​ వ్యాపార సంస్థలు కూడా ఈ ప్రాంతాల్లో మాంసాహారాన్ని అమ్మకూడదని యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.   జొమాటో, స్విగ్గీ లాంటి  ఆన్‌లైన్  వ్యాపార సంస్థలు కూడా ఈప్రాంతాల్లో మాంసాహారాన్ని  విక్రయించకూడదని తెలిపింది. 

 గెస్ట్‌హౌస్‌లు ,  ఇళ్లలో కూడా  మాంసాహారం అమ్మకాలను నిషేధించింది.  ఈ విషయంలో ప్రభుత్వ  పర్యవేక్షణ  ఉంటుందని  తెలిపింది.

 ఇప్పటికే హోటళ్ళు ..  దుకాణాలలో మాంసాహార ఆహారాన్ని అమ్మకండంపై నిషేధం ముందేఉంది.   ఆన్‌లైన్‌లో మాంసాహార ఆహారాన్ని ఆర్డర్ చేయడంపై  నిషేధం లేదు. అనేక మంది పర్యాటకులు ఆన్‌లైన్ దరఖాస్తుల ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేస్తున్నారని ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజల నుండి అనేక ఫిర్యాదులు అందడంతో యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న  యూపీ ప్రభుత్వం.. ఆన్​ లైన్​ ప్లాట్​ఫామ్​లను కూడా నిషేధించింది.  ఈ నిబంధనను  ఉల్లంఘిస్తే  చట్ట పరంగా కఠినమైన  చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.