
- చెస్ ప్లేయర్ గుకేశ్ దొమ్మరాజు, నటుడు అడివి శేషు అటెండ్
హైదరాబాద్, వెలుగు: జేఈఈ, నీట్ ఫలితాల్లో ఆలిండియా నంబర్ వన్ గా నిలిచిన సందర్భంగా శ్రీచైతన్య విద్యాసంస్థ.. “ఐరావత్ ఛాంపియన్స్" వేడుకను ఘనంగా నిర్వహించింది. మంగళవారం హైటెక్ సిటీ శిల్పకళావేదికలో జరిగిన ఈ వేడుకకు ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేశ్ దొమ్మరాజు, ప్రముఖ నటుడు అడివి శేషు చీఫ్ గెస్టులుగా అటెండ్ అయ్యారు. శ్రీచైతన్య డైరెక్టర్లు శ్రీధర్ యలమంచిలి, సుష్మా బొప్పన, సీమ బొప్పనతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న శ్రీచైతన్య విద్యార్థులు, టాపర్లు, అధ్యాపకులు వేడుకలో పాల్గొన్నారు.
జాతీయ స్థాయిలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు సన్మానం చేశారు. గుకేశ్ మాట్లాడుతూ.. పోటీ పరీక్షల విజయానికి క్రమశిక్షణ అవసరమన్నారు.నటుడు అడివి శేషు మాట్లాడుతూ..టాప్ ర్యాంకర్లను అభినందనలు తెలియజేశారు. శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరక్టర్ సుష్మ బొప్పన, శ్రీచైతన్య స్కూల్స్ అకడమిక్ మరో డైరక్టర్ సీమా బొప్పన పాల్గొన్నారు.