
హైదరాబాద్, వెలుగు: సీబీఎస్ఈ టెన్త్ ఫలితాల్లో తమ సంస్థ 498 మార్కులతో ఆలిండియా నెం.1 గా నిలిచి మరోసారి రికార్డు సృష్టించిందని శ్రీ చైతన్య స్కూల్ డైరెక్టర్ సీమ వెల్లడించారు. ఆరుగురు విద్యార్థులు 497 మార్కులు ఆపైన, 10 మంది విద్యార్థులు 406 మార్కులు ఆపైన, 26 మంది విద్యార్థులు 495 మార్కులు ఆపైన, 197 మంది విద్యార్థులు 490 మార్కులు ఆపైన, 480 మార్కులు ఆపైన 917 మంది శ్రీచైతన్య స్కూల్ విద్యార్థులు సాధించారని వివరించారు. అత్యధిక బ్రాంచీలు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయని చెప్పారు. పలు రాష్ట్రాల్లో స్టేట్ టాప్ మార్కులతో పాటు అత్యధిక యావరేజ్, పాస్ పర్సంటేజ్ తో తామే నెం.1 గా ఉన్నామని సీమ తెలిపారు.
టాప్ మార్కులలోగాని, ఉత్తీర్ణతా శాతంలో గాని దేశంలోని మరే ఇతర విద్యాసంస్థలు శ్రీచైతన్య సాధించిన ఫలితాలను సాధించలేకపోయాయని వెల్లడించారు. శ్రీచైతన్య ప్రతి విద్యార్థిపై చూపే వ్యక్తిగత శ్రద్ధ, రీసెర్చ్ ఓరియెంటెడ్ టీచింగ్ మెథడాలజీ, సీఓ-ఐపీయల్, సీ-ఐపీయల్, యమ్ పీయల్, సీ-బ్యాచ్, యస్ -బ్యాచ్, టెక్నో వంటి పటిష్టమైన అకడమిక్ ప్రోగ్రామ్స్, మైక్రో లెవల్ టీచింగ్ సిస్టమ్, అంకిత భావంతోనే ఈ ఫలితాలు వచ్చాయని సీమ పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి శ్రీ చైతన్య విద్యాసంస్థల మరో డైరెక్టర్ నాగేంద్ర అభినందనలు తెలియజేశారు.