ఐఎస్డీసీ కాన్ఫరెన్స్లో శ్రీచైతన్య స్టూడెంట్స్ ప్రతిభ

 ఐఎస్డీసీ కాన్ఫరెన్స్లో శ్రీచైతన్య స్టూడెంట్స్ ప్రతిభ

హైదరాబాద్, వెలుగు: నాసా ఆధ్వర్యంలో ఎన్​ఎస్​ఎస్​ నిర్వహించిన ఐఎస్​డీసీ కాన్ఫరెన్స్​లో శ్రీచైతన్య విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని శ్రీచైతన్య స్కూల్ అకడమిక్ డైరెక్టర్ సీమ శుక్రవారం వెల్లడించారు. ఈ కాన్ఫరెన్స్​కు సుమారు 30 దేశాలకు చెందిన 475 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. వీరిలో 67 మంది  ఇండియా నుంచి పాల్గొన్నారని, ఇందులో 45 మంది శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులేనని ఆమె పేర్కొన్నారు. ఇటీవల నాసా ఆధ్వర్యంలో ఎన్​ఎస్​ఎస్​ నిర్వహించిన స్పేస్​ సెటిల్​మెంట్​ కాంటెస్ట్​లోనూ శ్రీ చైతన్య 60 విన్నింగ్ ప్రాజెక్టులు గెలుచుకొని వరల్డ్ నంబర్​వన్​గా, చాంపియన్​గా నిలిచినట్టు చెప్పారు.

వీటిలో వరల్డ్​ థర్డ్​ ప్రైజ్​10, సెకండ్​ ప్రైజ్​4, ఫస్ట్​ ప్రైజ్​3 ఉన్నాయని, ఇవే కాకుండా 43 ప్రాజెక్టులు హానరబుల్​ మెన్షన్స్​ సాధించాయని చెప్పారు. ఐఎస్​డీసీ కాన్ఫరెన్స్​లో ఆర్టిస్టిక్ మెరిట్ కేటగిరీలో 500 డాలర్ల బహుమతి అందుకున్న ఏకైక టీమ్​శ్రీ చైతన్య టీమేనని చెప్పారు. శ్రీ చైతన్య స్కూల్ గ్రూప్ మాత్రమే 14 ఏండ్లుగా  క్రమం తప్పకుండా ఐఎస్​డీసీ కాన్ఫరెన్స్​లో పాల్గొంటున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులను ఆమె అభినందించారు.