వరల్డ్ కప్: ఇంగ్లండ్ పై 20 పరుగులతో  గెలిచిన లంక

వరల్డ్ కప్: ఇంగ్లండ్ పై 20 పరుగులతో  గెలిచిన లంక

వరల్డ్ కప్ లో భాగంగా లీడ్స్ వేదికగా ఇంగ్లండ్, శ్రీలంకల మధ్య జరిగిన మ్యాచ్ లో శ్రీలంక 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత యాభై ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. 233 పరుగులు టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 47 ఓవర్లలో అల్ ఔట్ అయి 212 పరుగులు చేసింది. దీంతో 20 పరుగుల తేడాతో లంక విజయాన్ని సొంతం చేసుకుంది. స్టోక్స్ 82, రూట్ 57 పరుగులు చేయగా మలింగా 4, డిసిల్వా 3, ఉదానా 2, ప్రదీప్ 1 వికెట్లు తీశారు.

ఇంగ్లండ్ జట్టుకు చెందిన నాలుగు కీలక వికెట్లను లసిత్ మలింగాకు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ దక్కింది. మలింగా వరల్డ్ కప్ మ్యాచ్ లలో యాభై వికెట్లు తీసిన రికార్డ్ నమోదైంది.