ODI World Cup 2023: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న శ్రీలంక.. గెలిస్తే సెమీస్‌కు భారత్

ODI World Cup 2023: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న శ్రీలంక.. గెలిస్తే సెమీస్‌కు భారత్

వరల్డ్ కప్ లో భారత్ శ్రీలంకతో పోరుకు సిద్ధమైంది. ముంబైలోని వాంఖడేలో జరగనున్న ఈ మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మెగా టోర్నీలో వరుసగా ఆరు మ్యాచ్ లు గెలిచి జోరు మీదున్న టీమిండియా ఈ రోజు గెలిస్తే సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. మరోవైపు ఆడిన ఆరు మ్యాచ్ ల్లో రెండు మ్యాచ్ ల్లో గెలిచిన శ్రీలంక ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇక ఈ మ్యాచ్ లో ధనంజయ డిసిల్వా స్థానంలో స్పిన్నర్ హేమంత్ తుది జట్టులోకి వచ్చాడు. భారత్ మాత్రం అదే జట్టుతో బరిలోకి దిగుతుంది. 

భారత్ (ప్లేయింగ్ XI):

రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్  

శ్రీలంక (ప్లేయింగ్ XI):

పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్(కెప్టెన్, వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, దుషన్ హేమంత, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక