శ్రీ వైష్ణవంలో ఆళ్వారుల తర్వాత కొత్త గురువుల వర్గం వచ్చింది. వాళ్లనే ఆచార్యులు అంటారు. వీళ్లు తమ పూర్వీకుల చేసిన సేవలను ఒకచోటుకు చేర్చడం, వర్గం వారిని అంతర్గతంగా బలోపేతం చేయడం. వాళ్లకు ప్రస్తుతం, భవిష్యత్లో జరిగే హింసాకాండలను ఎదుర్కొనే వనరులను కల్పిస్తారు. శంకరులు ‘అద్వైతం’ తత్వాన్ని వాదన, శాస్త్ర పటిమతో బలపరిచాడు. పదో శతాబ్దం చివరికల్లా శంకరుని అద్వైతం చరిత్రలో నిలిచిపోయింది. బలిష్టమైన చోళ వంశంవారు పరిపాలనకు రావడం, వారికి శివారాధన పట్ల గల పక్షపాతం శ్రీ వైష్ణవ తత్వ ఐక్యతకు ప్రమాదకరంగా పరిణమించింది.
శ్రీ వైష్ణవంలో నేతృత్వం చేపట్టడానికి మంచి వారసుడు కావాలని ఆయన ప్రభువును వేడుకున్నాడు. ఆయన ప్రార్థన ఫలించింది. ఆయన మనవడు తన సోదరీమణులతో సహా తిరుమలైలో విష్ణు ఆలయం దగ్గర స్థిరపడ్డాడు. వారిలో ఒకామెకు ప్రాచీన సాంస్కృతిక, రాజకీయ చోళ వైస్రాయ్కి కేంద్రమైన నివాసితో వివాహమైంది. ఆమెకు పుట్టిన కొడుకే రామానుజుడు.. అందగాడు, తెలివైనవాడు. తన తండ్రి విద్యాబోధనలో అతడు అప్పటి సంప్రదాయ విద్యల సారాన్ని, మత, ఐహిక విషయాలను ఔపోసన పట్టాడు. 17వ ఏటనే ఆయనకు పెండ్లి అయింది. తండ్రి కేశవ సోమయాజి ఆ తర్వాత కొద్దికాలానికే మరణించాడు. అప్పుడు రామానుజుడు తన తల్లి, భార్యతో సహా కంచికి వెళ్లాడు. అక్కడ ఉన్న ‘యాదవ ప్రకాశ’ అనే పండితుని దగ్గర అద్వైత సిద్ధాంతాన్ని ఆరు సంవత్సరాలు అభ్యసించాడు.
ఆ కాలంలో గురుశిష్యులిద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అందుకు కారణం రామానుజుని బుద్ధి సూక్ష్మత, పాండిత్యము, స్వతంత్ర భావాలు. దాంతో కోపగించుకున్న గురువు తన విద్యార్థులందరితో కలిసి కాశీ యాత్రకు బయలుదేరాడు. కొద్దిదూరం ప్రయాణం చేశాక రామానుజునికి అనుమానం కలిగింది. దాంతో ఆయన వారి నుంచి విడిపోయి ఒంటరిగా తిరుగు ప్రయాణమయ్యాడు. వాళ్లు తిరిగి వచ్చాక విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు. తనకు 22 ఏండ్లు నిండకముందే తన తెగలో వీరుడిగా కీర్తిగాంచాడు. వయసుమీరిన యమునాచార్యుల కోసం వెంటనే శ్రీరంగం రమ్మని పిలువనంపాడు. ఆయన వచ్చేసరికి యమునాచార్యులు మరణించారు. తీవ్ర నిరాశానిస్పృహలకు గురైన ఆయన తిరిగి కంచికి వెళ్లాడు. ఆయన చేస్తున్న అన్వేషణలో సంసారజీవితం ప్రతిబంధకంగా అనిపించింది. అప్పటికే తల్లి మరణించింది. దాంతో సంసార జీవితానికి స్వస్థి పలకాలి అనుకున్నాడు. అందుకోసం భార్యకు కావాల్సినవన్నీ సమకూర్చి, 30 ఏండ్ల వయసులో విష్ణు ఆలయంలో సన్యాసం తీసుకున్నాడు. సన్యాస వర్గంలో ఆయన గొప్పవాడు. యమునాచార్యుని శిష్యుల ఒత్తిడితో ఆయన శ్రీరంగానికి వెళ్లి ఒక గొప్ప గురువు వారసుడిగా పీఠాధిపతి అయ్యాడు. అది 70 సంవత్సరాలకు పైగా కొనసాగింది. పీఠాధిపతిగా తాత్విక సాహిత్యాన్ని ‘శ్రీ భాష్యం’గా అందించాడు.
సాధారణ స్థాయి విద్యార్థుల కోసం బ్రహ్మ సూత్రాలను క్లుప్తంగా మూడు భాగాలుగా రాశాడు. అప్పటికే చోళ సామ్రాజ్యంలో ఒక బలమైన జాతి రూపుదిద్దుకుంటూ ఉంది. ఐదుగురి తర్వాత సింహాసనం కుళోత్తుంగుడు–1కు స్వాధీనమైంది. రామానుజుడు మైసూరుకు వెళ్లాడు. రామానుజుడు తప్పించుకున్న విషయం తెలిసిన చోళ చక్రవర్తి ఆయన శిష్యుడిని చనిపోయేంతగా హింసించాడు. మైసూరులో 20 ఏండ్లు ఉన్న ఆయన విష్ణువర్థనుడు అనే నామంతో వైష్ణవులుగా మారిన వారిని శ్రీవైష్ణవాసంలో ఉంచారు. ఐదు గొప్ప దేవాలయాలు యదుగిరి లోని నారాయణాలయంతో సహా విష్ణువును అంకితం చేశారు. కుళోత్తుంగ చోళుడు–1 మరణించిన తర్వాత శ్రీరంగానికి వచ్చిన రామానుజుడు మరో పదేండ్లు సంచారం కొనసాగించాడు. క్రీ.శ. 1137లో మరణించాడు.
- మేకల
మదన్మోహన్ రావు
కవి, రచయిత
