- బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు
హైదరాబాద్: ‘‘రాముడి నిధి సేకరణ అంటే… ఐస్ క్రీం అమ్మి 5 లక్షలు సంపాదించినట్లు కాదు కేటీఆర్.. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి..’’ అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అని హెచ్చరించారు. వరంగల్ ఘటనలపై స్పందించిన ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘కేటీఆర్ నువ్వు లేస్తే అయ్యేదేమి లేదు.. బీజేపీ నేతలు, కార్యకర్తలు గురించి ప్రజలకు తెల్సు.. ఎన్నో త్యాగాలు చేసిన చరిత్ర బీజేపీ నేతలు, కార్యకర్తలది… టీఆర్ఎస్ నేతలు రెచ్చిపోతుంటే కేటీఆర్ సపోర్ట్ చేస్తున్నాడా?’’ అని ఆయన ప్రశ్నించారు. రామమందిరం కోసం అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా నిధులు ఇస్తున్నారు..అయోధ్య రాముడి నిధి సేకరణ పై భద్రాద్రి రాముడు గుడి వద్ద చర్చకు సిద్దం.. రాముడి నిధి సేకరణ పై రాష్ట్ర ట్రస్టు ఛైర్మన్ వీసం శెట్టి విద్యాసాగర్ వస్తాడు.. అన్ని అనుమానాలను నివృత్తి చేస్తడు.. కేటీఆర్ వస్తాడా? చర్చకు.. అన్ని లెక్కలు చెప్తాం’’ అని రఘునందన్ రావు అన్నారు.
రాముడిపై ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేస్తే రామ దండు కదులుతుంది
రాముడిపై ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేస్తే రామ దండు కదులుతుంది.. గతంలో రాముడు కోసం రామ దండు ఏమి చేసిందో ఇప్పుడు అదే జరుగుతుంది.. జాగ్రత్త!.. కేటీఆర్ , ఎమ్మెల్యే ధర్మా రెడ్డి లకు చెబుతున్నా… కిష్కింధ కాండ జరిగితే మా బాధ్యత కాదు.. రామ దండు కదిలితే మీ ప్రగతి భవన్, ఫాంహౌస్లు, మీ కాంట్రాక్ట్లు ఉంటాయా?… మాట్లాడేటప్పుడు జాగ్రత్త గా మాట్లాడాలి’’ అని రఘునందన్ రావు హెచ్చరించారు. పోలీస్ లు కాఖీ డ్రెస్ వేసుకున్నారా? పింక్ డ్రెస్ వేసుకున్నారా? పరకాలలో, వరంగల్లో బిజెపి కార్యకర్తల ఇండ్లపై దాడులు జరుగుతుంటే పోలీస్ అధికారులు ఏం చేస్తున్నరు? అని ప్రశ్నించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీజేపీ కార్యకర్తలను ఉరికించి కొట్టే పరిస్థితి నీకు ఉందా? పోలీస్ ఎస్కార్ట్ లేనిది నువ్వు కాలు కూడా కదపవు… బిజెపి కార్యకర్తలే నిన్ను వురికించి కొడతారని ఆయన హెచ్చరించారు.
రేపు రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి నిరసన కార్యక్రమాలు
టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు రాముడిని కించే పరిచే విధంగా మాట్లాడంపై రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని, అన్ని మండల కార్యాలయాల వద్ద నోటికి నల్లగుడ్డ కట్టుకొని నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని బిజెపి పిలుపునిచ్చింది. రాముడిపై టీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యే లు, మంత్రులు చేసిన కామెంట్స్ పై 24 గంటల్లోగా క్షమాపణ చెప్పాలి.. క్షమాపణలు చెప్పకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తం.. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు రాముడిపై కామెంట్స్ చేసినప్పుడు దేవుడు బుద్ధి ఇవ్వడంతో సాయంత్రానికే క్షమాపణ చెప్పిండు.. అట్లనే మిగతా టీఆర్ఎస్ నేతలకు కూడా రాముడు మంచి బుద్ధి ఇవ్వాలని.. వాళ్లు కూడా క్షమాపణ చెప్పేలాగా ఆ రాముడు చూడాలని కోరుతున్నాను..’’ అని ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు: కుటుంబ సభ్యులకు వాటాల ప్రకారం రేషన్