లాక్ డౌన్ తర్వాత తెరచుకోనున్న శ్రీకాళహస్తి ఆలయం

లాక్ డౌన్ తర్వాత తెరచుకోనున్న శ్రీకాళహస్తి ఆలయం

లాక్ డౌన్ కారణంగా దాదాపు రెండు నెలలకు పైగా దేశవ్యాప్తంగా ఆలయాలు మూతపడ్డాయి. అయితే చిత్తూరు జిల్లాలో కొలువైన శ్రీకాళహస్తీశ్వరాలయంలో లాక్ డౌన్ తర్వాత దర్శనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆలయంలో దర్శనానికై నిలబడే భక్తుల కోసం మార్కింగ్ రింగ్స్ ఏర్పాటు చేశారు. లాక్ డౌన్ నుంచి మినహాయింపు రాగానే… భక్తులను ఆలయంలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు ఈవో చంద్రశేఖర్ రెడ్డి. ప్రతి ఒక్కరి శరీర ఉష్ణోగ్రతను పరిశీలించేందుకు థర్మల్ గన్స్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అందరూ మాస్క్ లు ధరించి రావాలని, శానిటైజర్లతో ప్రత్యేక స్టాండ్లు కూడా ఉంటాయని అన్నారు. ఆలయంలోకి వచ్చే భక్తులను ముందుగా డిజిన్ఫెక్షన్ టన్నెల్ లోకి పంపిస్తామన్నారు. రాహుకేతు పూజలకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఒక పూజా టికెట్ కు ఒక పీట, ఒకరికి మాత్రమే అనుమతి ఉంటుందని ఈవో చెప్పారు.