
శ్రీకృష్ణుడు.. శ్రీ మహావిష్ణువు అవతారమని పురాణాలు చెబుతున్నాయి. విష్ణుస్వరూపుడైన కృష్ణ పరమాత్ముడు ద్వాపరయుగంలో ... సృష్టి కర్త శివుడని పూజించాడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. .. విష్ణువు.. శివుణ్ణి ఆరాధించడమేమిటి? ఆయనకు పార్వతీదేవి వరాలు ఇవ్వడమేమిటి? మొదలగు విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
శ్రీకృష్ణుడు ... శివుడిని ఆరాధించడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని శౌనకాది మునులకు ఒక సందేహం వచ్చింది. .. శ్రీకృష్ణుడు ...సాక్షాత్తు శ్రీమన్నారయణుని అంశ అయి వుండీ... సర్వ సిద్ధ ప్రదుడై వుండీ సాధారణ మానవుడిలాగా మరొక దేవుడిని ఉపాసించడమేంటి? ఘోర నియమాలతో తపస్సు చేయడమేంటి? ఇది మాకు అర్థం కాని విధంగా వుందని శౌనకాది మునులకు వచ్చిన సందేహాలను సూత మహర్షి వివరించారు.
శౌనకాది మునులకు వచ్చిన సందేహమే గతంలోనూ జనమేజయుడికీ వచ్చిందని.. అప్పుడు ఆయన ఆ సమయంలో వ్యాసుడి దగ్గర వ్యక్తం చేశాడట. అప్పుడు వ్యాసుడు ఆయనకు చెప్పిన సమాధానాన్నే సూత మహర్షి... శౌనకాది మునులకు చెప్పారని పండితులు చెబుతున్నారు.
శ్రీకృష్ణుడు జనార్దనుడు.... సర్వకార్య నిర్వహణ సమర్థుడు... కాని మానవరూపంలో వున్నాడు కదా. అందుకుని మనుష భావాలను ఆచరించాడు. పెద్దలను గౌరవించడం, గురువులను పూజించడం, బ్రాహ్మణులను సత్కరించడం, దేవతలను ఆరాధించడం లాంటి గృహస్థాశ్రమ ధర్మాలను అనుసరించాడు. అలాగే దుఃఖ పడవలసిన విషయాలలో దుఃఖపడటం, సంతోషించాల్సిన సందర్భాలలో సంతోషించడం, రకరకాల అపవాదాలకు తల ఒగ్గి బాధపడటం, స్త్రీలతో ఎలా ఉండాలో అలా ఉండటం.. సమయానుకూలంగా విజృంభించే అరిషడ్వర్గాలకు లోనుకావడం లాంటివి మనుషులు చేసే విధానాలకు .. మనుషుల ప్రవర్తనకు కట్టుబడ్డాడు.
గుణమయ శరీరాన్ని ధరించి గుణాతీతంగా వుండటం అసంభవం. అందువలన సౌబలి శాపం వల్ల యాదవ వినాశనం, బ్రాహ్మణ శాపం వల్ల కృష్ణుడి అవతార సమాప్తి జరుగుతుందని తెలిసినా.. వాటిని తప్పించలేదు. కృష్ణుడి పత్నులను దొంగలు దోచుకున్నారు. అప్పుడు అర్జునుడు అక్కడే ఉన్నాడు.
మహావీరుడైన అర్జునుడు బాణాలు వేసి దానిని ఆపగలిగేశక్తి ఉన్నా ఆ పని చేయలేదు. కనీసం తెలుసుకోను కూడా తెలుసుకోలేకపోయాడు. వీటన్నిటి ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, మానవ దేహం ధరించినప్పుడు మానవ లక్షణాలే వుంటాయి. అందుచేత నారాయణుడైనా, నారాయణాంశజుడైనా మానవుడు... మానవుడే కదా..! మానవ రూపంలో వున్న శ్రీకృష్ణుడు శివుణ్ణి ఆరాధించడంలో ఎంతమాత్రం ఆశ్చర్యం అవసరం లేదని పండితులు చెబుతున్నారు.
శివుడు సర్వేశ్వరుడు.... విష్ణుమూర్తికి కూడా కారణ భూతుడు. సుషుప్తస్థాన నాథుడు. విష్ణువుకే శివుడు పూజనీయుడు అయినప్పుడు కృష్ణునికి .. శివుడు పూజనీయుడు కావడంలో వింత ఏమీ లేదు. ఆదిపరాశక్తి సర్వోతృష్ట. ..జగన్మాత అర్ధమాత్రంగా ఉన్నప్పటికీ తక్కిన త్రిమూర్తులలో బ్రహ్మ కన్నా... విష్ణువు, విష్ణువు కన్నా శివుడు అధికులు. అందుచేత శ్రీకృష్ణుడు... శివుణ్ణి అర్చించారని దేవి భాగవతం ద్వారా తెలుస్తుంది. . .