
‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీతో ఆకట్టుకున్న హీరోయిన్ శ్రీనిధి శెట్టి.. ఇటీవల తెలుగులో వరుస సినిమాలు చేస్తోంది. ఇటీవల సిద్ధు జొన్నలగడ్డకు జంటగా ‘తెలుసు కదా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా మరో క్రేజీ సినిమాలో ఛాన్స్ అందుకుంది. వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.
హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్పై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో వెంకటేష్ కు జంటగా కనిపించబోతోంది శ్రీనిధి శెట్టి. మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని రివీల్ చేస్తూ.. ఈ ప్రాజెక్ట్లోకి ఆమెకు వెల్కమ్ చెప్పారు మేకర్స్.