కేంద్ర ప్రభుత్వ వైఖరిని  ఖండించండి : శ్రీనివాస్

కేంద్ర ప్రభుత్వ వైఖరిని  ఖండించండి : శ్రీనివాస్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం రైతులపై చేస్తున్న జులుంను ఖండించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్  కోరారు. బుధవారం పట్టణంలోని అంబేద్కర్  చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన రైతులపై దాడి చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు.

మంగళవారం ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతు నాయకులపై లాఠీచార్జి, నీటి ఫిరంగులు, రబ్బర్  బుల్లెట్లు, భాష్పవాయువు, డ్రోన్లను ఉపయోగించడం దుర్మార్గమన్నారు. స్వామినాథన్​ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని హామీ ఇచ్చి పక్కన పెట్టారని విమర్శించారు. రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామని చెప్పి మూడేండ్లు గడిచినా ఎత్తివేయలేదన్నారు. రమేశ్, నాగరాజు, వెంకటేశ్, సత్యం, శివ, సురేశ్​ పాల్గొన్నారు.