లింగంపేట మండలంలో..జీపీ ట్రాక్టర్ ​బోల్తాపడి డ్రైవర్ ​మృతి

లింగంపేట మండలంలో..జీపీ ట్రాక్టర్ ​బోల్తాపడి డ్రైవర్ ​మృతి

లింగంపేట, వెలుగు : జీపీ ట్రాక్టర్​ బోల్తాపడి శ్రీనివాస్​(25) అనే యువకుడు​ మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం లింగంపేట మండలం నల్లమడుగు పెద్దతండాలో జరిగింది. ఎస్ఐ చైతన్య కుమార్​రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం శ్రీనివాస్​హరితహారం చెట్ల కోసం ట్రాక్టర్​ట్యాంకర్​లో నీటిని నింపుకుని వస్తున్నాడు.

మూలమలుపు వద్ద ట్రాక్టర్​ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో శ్రీనివాస్ ​అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య కావేరి, కొడుకులు శ్రీఆదిత్య, శ్రీహాన్ ఉన్నారు. మృతుడి తండ్రి దూద్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు నిర్వహిస్తున్నారు.