బస్తీ నుంచి బంగ్లా వరకు.. శ్రీరంగనీతులు ట్రైలర్ రిలీజ్

బస్తీ నుంచి బంగ్లా వరకు.. శ్రీరంగనీతులు ట్రైలర్ రిలీజ్

సుహాస్, కార్తీక్ రత్నం, విరాజ్ అశ్విన్, రుహాని శర్మ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం  ‘శ్రీరంగనీతులు’. ప్రవీణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్ వీఎస్ఎస్ ద‌‌‌‌‌‌‌‌ర్శకత్వంలో  వెంక‌‌‌‌‌‌‌‌టేశ్వర‌‌‌‌‌‌‌‌రావు బ‌‌‌‌‌‌‌‌ల్మూరి నిర్మించారు. ఏప్రిల్ 12న సినిమా విడుదల కానుంది. నిర్మాత ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌ను నిర్వహించారు. సుహాస్ మాట్లాడుతూ మాట్లాడుతూ ‘ఇదొక ఆంథాల‌‌‌‌‌‌‌‌జీ సినిమా. మంచి సినిమా చూస్తున్న ఫీలింగ్ క‌‌‌‌‌‌‌‌లుగుతుంది.

మా ప్రయ‌‌‌‌‌‌‌‌త్నాన్ని ఆద‌‌‌‌‌‌‌‌రిస్తార‌‌‌‌‌‌‌‌ని కోరుకుంటున్నా’ అని అన్నాడు.  విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ  ‘ఈసినిమాకు క‌‌‌‌‌‌‌‌థే హీరో.  బ‌‌‌‌‌‌‌‌స్తీ నుంచి బంగ్లా వరకు అందరూ క‌‌‌‌‌‌‌‌నెక్ట్ అయ్యే క‌‌‌‌‌‌‌‌థ ఇది’ అని చెప్పాడు. తనకు నచ్చిన ఆర్టిస్టులతో కలిసి ఇందులో నటించానన్నాడు కార్తీక్ రత్నం.  ఇలాంటి సినిమాల‌‌‌‌‌‌‌‌ను స‌‌‌‌‌‌‌‌పోర్ట్ చేస్తే మ‌‌‌‌‌‌‌‌రిన్ని మంచి చిత్రాలు వస్తాయని రుహాని శర్మ చెప్పింది.  ప్రేక్షకులకు నచ్చే అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయని దర్శక నిర్మాతలు చెప్పారు. టీమ్ అంతా పాల్గొన్నారు.