నిన్న రాత్రే విధుల్లోకి చేరాడు.. తెల్లారేసరికి విగతజీవిగా మారాడు.

నిన్న రాత్రే విధుల్లోకి  చేరాడు.. తెల్లారేసరికి విగతజీవిగా మారాడు.

శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో చోటు చేసుకున్న ప్రమాదంలో సూర్యాపేట జిల్లాకు వ్యక్తి మృతి చెందాడు. జిల్లాలోని చివ్వేంల మండలం జగనతండాకి చెందిన ఏఈ ధరావత్ సుందర్(35) ఈ ప్రమాదంలో చనిపోయాడు. దీంతో ఆ తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత నెల రోజుల క్రితమే సుందర్‌కు కరోనా పాజిటివ్ రావడంతో తన సొంత గ్రామానికి వచ్చాడు. 15 రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉండి కరోనాను జయించాడు. ఆ తరువాత యధావిధిగా విధుల్లో చేరాడు. గురువారం నాడు రాత్రి 9 గంటలకు విధుల్లో భాగంగా సుందర్ శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రానికి వెళ్లాడు. ఈ క్రమంలోనే విద్యుత్ కేంద్రంలో చోటు చేసుకున్న ప్రమాదంలో సుందర్ చిక్కుకున్నాడు. సుందర్‌కు భార్య ప్రమీల, ఇద్దరు కూతుళ్లు మానస్వి, నిహస్వి ఉన్నారు. అత‌ని తండ్రి నాగేశ్వరరావుకోపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా ప‌నిచేస్తున్నారు.