శ్రీరాంపూర్ ఏరియాలోని వైభవంగా ఎస్సార్పీ-1 కోల్‌‌‌‌‌‌‌‌మైన్గోల్డెన్‌‌‌‌‌‌‌‌ జూబ్లీ వేడుకలు

శ్రీరాంపూర్ ఏరియాలోని వైభవంగా ఎస్సార్పీ-1 కోల్‌‌‌‌‌‌‌‌మైన్గోల్డెన్‌‌‌‌‌‌‌‌ జూబ్లీ వేడుకలు

కోల్​బెల్ట్​/నస్పూర్​, వెలుగు: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​ ఏరియాలోని ఎస్సార్పీ-1 అండర్​ గ్రౌండ్​ బొగ్గు గనిని ఏర్పాటు చేసి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం గని ఆవరణపై గోల్డెన్​జూబ్లీ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ స్టేట్​ ప్రెసిడెంట్​ వాసిరెడ్డి సీతారామయ్య, ఏరియా జీఎం మునిగంటి  శ్రీనివాస్, సింగరేణి డైరెక్టర్(ప్రాజెక్టు,ప్లానింగ్​) కె.వెంకటేశ్వర్లు జ్యోతి ప్రజ్వలన చేసి గోల్డెన్ జూబ్లీ వేడుకలను ప్రారంభించారు. కేక్​కట్​ చేసిన అనంతరం 50 ఏళ్ల ప్రస్థానంలో ఎస్సార్పీ-1 కోల్​మైన్​ సాధించిన విజయాలపై ప్రత్యేక డాక్యుమెంటరీ, పైలాన్‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ ద్వారా విద్యుత్​ అవసరాలకు కావాల్సిన బొగ్గును యాభై ఏళ్లుగా సరఫరా చేస్తూ జాతికి వెలుగులు అందించడంలో ఎస్సార్పీ-1 ఆదర్శంగా నిలిచిందన్నారు. 

కార్మికులు, ఉద్యోగులు, ఆఫీసర్ల సమష్టి కృషితో ఎస్సార్పీ-1 కోల్​మైన్​ క్వాలిటీ బొగ్గును ఉత్పత్తి చేస్తూ రక్షణ, భద్రతా అంశాల్లో జాతీయ రికార్డులు సృష్టిస్తూ ముందుకు సాగుతుందన్నారు. గనిలో కొత్త పనిప్రదేశాలను గుర్తించడంలో  ఏరియా జీఎం శ్రీనివాస్​, ఏజెంట్​రవికుమార్​, గని మేనేజర్​ ఆత్మారాం సహాని చురుగ్గా వ్యవహరించారన్నారు. నూతన ఉపాధులు, బొగ్గు ఉత్పత్తి పెంపునకు సింగరేణి కంపెనీలో కొత్త బొగ్గు గనులు రావాల్సిన అవసరం ఉందని, చెన్నూరు సౌత్​, నార్త్​, శ్రావణపల్లి, చింతగూడ బొగ్గు గనులను ప్రారంభించేందుకు సింగరేణి యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఈ వేడుకలకు కార్మికులు, రిటైర్డు కార్మికులు, ఆఫీసర్లు వేలాదిగా హాజరయ్యారు. వేడుకల్లో శ్రీరాంపూర్​ ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్​, క్వాలిటీ జీఎంలు వీరభద్రరావు, వెంకటరమణ, మాజీ జీఎం సుగుణకర్​రెడ్డి, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ బాధ్యులు, తదితరులు పాల్గొన్నారు.