హైదరాబాద్, వెలుగు: టెన్త్ హిందీ పేపర్ లీకేజీ కేసులో దండుబోయిన హరీశ్ అనే స్టూటెండ్ను డిబార్ చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. హన్మకొండలోని కమలాపూర్ జెడ్పీ స్కూల్లో ఎగ్జామ్ పేపర్ లీక్ చేశాడనే ఆరోపణతో హరీశ్ ను డిబార్ చేశారు. వెంటనే కోర్టు ద్వారా ఉత్తర్వులు పొందిన స్టూడెంట్ మిగిలిన పరీక్షలు రాశాడు. తుది తీర్పుకు లోబడి ఆ ఫలితాలు ఉంటాయని అప్పట్లో హైకోర్టు చెప్పింది. దీనిపై ఇటీవల జస్టిస్ ముమ్మినేని సుధీర్ కుమార్ తీర్పు చెప్పారు.
సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా అధికారుల చర్యలు ఉన్నాయన్నారు. డిబార్ చేసే అధికారం ఆఫీసర్లకు ఉందని.. అందుకు సంబం ధించిన నిబంధనల్ని అమలు చేయలేదని వివరించారు. హరీశ్కు నోటీసులిచ్చి అతని వివరణ పొందలేదని గుర్తు చేశారు. పరీక్ష రాస్తుండగా హరీశ్ దగ్గరకు శివాజీ అనే వ్యక్తి వచ్చి హిందీ ఎగ్జామ్ పేపర్ను ఫోన్తో ఫొటో తీసి వాట్సాప్ ద్వారా పలువురికి పంపాడని అభియోగముందని అన్నారు. మరి ఇందుకు సంబంధించిన ఆధారాలను చూపలేదని తెలిపారు. హరీశ్ డిబార్ చెల్ల దని..అతని సప్లి ఫలితాలను వెల్లడించి సర్టిఫికేట్ను ఇవ్వాలని తీర్పు వెల్లడించింది..