కార్గో సర్వీసులను ఆర్టీసీ శుక్రవారం ప్రారంభించింది. సంస్థ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇవి అందు బాటులోకి వచ్చాయి. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కార్గో సేవలను ప్రారంభించాలని నాలుగు నెలలుగా వాయిదా వేస్తూ వచ్చారు. అయితే లాక్డౌన్ నేపథ్యంలో సర్వీసులను మొదలుపెట్టారు. ప్రస్తుతం తెలంగాణ ఫుడ్స్ కు సంబంధించి అంగన్వాడీ సెంటర్ల కు ఈ సర్వీసుల ద్వారా సరుకులు రవాణా చేస్తున్నారు. అవసరం ఉన్న చోట డిపోకు ఒక్కో కార్గో బస్సును అందుబాటులో ఉంచారు. 58 బస్సులు రెడీ సొంతంగా కార్గో, పార్సిల్ సర్వీసులు నడిపి ఆదాయం పొందేందుకు ఆర్టీసీ కార్గో సేవలను తీసుకురావాలని గతంలో నిర్ణయించింది. మొత్తం 820 బస్సుల దాకా ఇందు కోసం సిద్ధం చేయాలనుకుంది. అయితే.. ప్రస్తుతం 58 బస్సులను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో శుక్రవారం 20 బస్సులను లాంచ్ చేశారు. మిగతా బస్సుల్ని ఒకటీ రెండురో జుల్లో ప్రారంభించనున్నారు. తెలంగాణ ఫుడ్స్ కు సంబంధించి బాలామృతం, పాలు, గుడ్లు ఇతర సరుకులను కార్గో బస్సుల్లో తరలిస్తున్నారు. వీటికి ప్రస్తుతానికైతే ఎలాంటి చార్జీలు లేవని ఆర్టీసీ ఆఫీసర్లు చెబుతున్నారు.
ఆర్టీసీ కార్గో సర్వీసులు ప్రారంభం
- హైదరాబాద్
- April 11, 2020
లేటెస్ట్
- త్వరగా అన్లోడ్ చేయించాలి : కలెక్టర్బెన్ షాలోమ్
- ఎఫ్సీఐలో శిక్షణకు ఏడుగురి ఎంపిక
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష
- నాసిరకం విత్తనాలు అమ్మే కంపెనీలపై చర్యలేవీ?
- గూగుల్కు పోటీగా చాట్ జీపీటీ సెర్చ్ ఇంజిన్
- ఆశ్రమ పాఠశాల వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఐటీడీఏ పీవో
- ఎవరెస్ట్, MDH మసాల బ్రాండ్లపై నేపాల్ నిషేదం
- Prabhas: ప్రభాస్ డార్లింగ్ ట్విట్ : పెళ్లి గురించే అంటూ టాక్
- నకిలీ విత్తనాలతో రైతులు జాగ్రత్తగా ఉండాలి : ఏవో వాణి
- SSMB 29 CASTING: రాజమౌళి-మహేష్ SSMB29 కాస్టింగ్పై రూమర్స్.. నోట్ రిలీజ్ చేసిన యూనిట్
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు