రామయ్య ఎడ్యుకేషనల్ అకాడమీలో జేఈఈ, ఐఐటీ, నీట్ కోచింగ్

రామయ్య ఎడ్యుకేషనల్ అకాడమీలో జేఈఈ, ఐఐటీ, నీట్ కోచింగ్

రామయ్య ఎడ్యుకేషనల్ అకాడమీలో జేఈఈ, ఐఐటీ, నీట్ కోచింగ్
ప్రారంభించిన చైర్మన్ సిరికొండ లక్ష్మీనారాయణ

హైదరాబాద్, వెలుగు: ఇంటర్‌‌‌‌‌‌‌‌ పూర్తయిన స్టూడెంట్లకు జేఈఈ, ఐఐటీ, నీట్ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం రామయ్య ఎడ్యుకేషనల్ అకాడమీని సోమవారం రామయ్య కాంపిటీటివ్ కోచింగ్ సెంటర్ చైర్మన్ సిరికొండ లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ సిరికొండ సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. రామయ్య ఎడ్యుకేషనల్ అకాడమీలో జేఈఈ, ఐఐటీ, నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ తో పాటు ఆరు నుంచి పదో తరగతి స్టూడెంట్లకు ఐఐటీ, నీట్ ఎంట్రెన్స్ కు ఫౌండేషన్ కోచింగ్ ఉంటుందని తెలిపారు. దీంతో పాటు ఎన్‌‌‌‌టీఎస్‌‌‌‌ఈ, ఒలంపియాడ్​కు ప్రత్యేకంగా ఆన్​లైన్, ఆఫ్‌‌‌‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్పారు. ఎంసెట్ కోసం షార్ట్ టర్మ్ కోచింగ్ కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

ఈ కోచింగ్ క్లాసుల కోసం కార్పొరేట్ కాలేజీలో అనుభవం ఉన్న ఆచార్య సముద్రాలను అకడమిక్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా, ఎక్స్‌‌‌‌పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీని నియమించామని తెలిపారు. ఫీజులో రాయితీ కోసం ఈ నెల 8న ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు దిల్​సుఖ్​నగర్​లోని  రామయ్య ఎడ్యుకేషనల్ అకాడమీలో స్కాలర్ షిప్ టెస్ట్ నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రామయ్య పోలీస్ అకాడమీ డైరెక్టర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.