ఎంసెట్ ఫలితాలు విడుదల

ఎంసెట్ ఫలితాలు విడుదల

హైదరాబాద్ లో ఎంసెట్ ఫలితాలు విడుదల చేశారు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి. ఇంజినీరింగ్ విభాగంలో 82.47 శాతం, అగ్రికల్చర్, ఫార్మసీలో 93శాతం మంది విద్యార్ధులు పాస్ అయినట్లు తెలిపారు. 

ఇంజినీరింగ్ విభాగంలో ఏపీకి చెందిన రవిశ్రీతేజకు ఫస్ట్ ర్యాంక్, హైదరాబాద్ చెందిన చంద్రశేఖర్ కు సెకండ్ ర్యాంక్, ఆశాక్ రెడ్డికి మూడో ర్యాంక్ సాధించినట్లు చెప్పారు. అగ్నికల్చర్, ఫార్మసీ విభాగంలో భూపాలపల్లి జిల్లాకు చెందిన కుశ్వంత్ ఫస్ట్ ర్యాంక్, రాజమండ్రికి చెందిన కిరణ్ కు రెండో ర్యాంకు, కాకినాడకు చెందిన అరుణ్ తేజ మూడో ర్యాంక్ లు సాధించారన్నారు అధికారులు.