వెటరన్స్ క్రికెట్ మ్యాచ్ కు మంత్రులు హరీష్ రావు , నిరంజన్ రెడ్డి హాజరు

వెటరన్స్ క్రికెట్ మ్యాచ్ కు మంత్రులు హరీష్ రావు , నిరంజన్ రెడ్డి హాజరు

సిద్దిపేట : సిద్దిపేటలోని జయశంకర్ స్టేడియంలో నిర్వహించిన వెటరన్స్ క్రికెట్ మ్యాచ్ కు నిన్న రాత్రి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు కాసేపు బ్యాట్ పట్టి, బౌలింగ్ చేస్తూ సరదాగా గడిపారు మంత్రి హరీష్​ రావు. 

తర్వాత వెటరన్స్ మ్యాచ్ లో మంత్రి హరీశ్ రావు 11 వర్సెస్ -రాధాకిషన్ రావు జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్ జరిగింది. అందులో రాధాకిషన్ జట్టు విజేతగా నిలిచింది. ఈ మేరకు క్రికెట్ మ్యాచ్ లో విన్నర్, రన్నరప్ జట్లకు మంత్రులు బహుమతులు అందజేశారు.