ఇది చూస్తే కామారెడ్డి హోటల్స్లో తినరు.. నల్లటి నూనె, ముక్కిపోయిన పిండి.. కిచెన్ చూస్తే ఇక అంతే!

ఇది చూస్తే కామారెడ్డి హోటల్స్లో తినరు.. నల్లటి నూనె, ముక్కిపోయిన పిండి.. కిచెన్ చూస్తే ఇక అంతే!

కామారెడ్డి​, వెలుగు :  కామారెడ్డి జిల్లాలోని హోటల్స్, ఫ్లోర్ మిల్​పై స్టేట్​ఫుడ్ సేఫ్టీ టాస్క్​ఫోర్స్​ టీమ్​  మంగళవారం (జూన్ 10)  దాడి చేసి..  రూ. 28 లక్షల విలువైన శనగ పిండిని సీజ్ చేసింది.  రూ. 62 వేల విలువైన గడువు తీరిన ఆహార సామగ్రిని ధ్వంసం చేసింది.  

వివరాల్లోకి వెళ్తే.. స్టేట్ ఫుడ్​సేఫ్టీ ఉన్నతాధికారులు, ఐపీఎం డైరెక్టర్​శివలీల ఆదేశాలతో  స్టేట్ ఫుడ్ ​సేఫ్టీ టాస్క్​ఫోర్స్​ టీమ్ హెడ్​, జోనల్ ​అసిస్టెంట్ ​ఫుడ్ కంట్రోలర్​ వి.జ్యోతిర్మయి ఆధ్వర్యంలో  పుడ్ ఇన్ స్పెక్టర్లు  పి.రోహిత్​రెడ్డి,  ఎస్​. శ్రీషిక, పి.స్వాతి, ఎన్​. జగన్నాథ్​ టీమ్​ రామారెడ్డి మండలం పోశానిపేటలోని వైష్ణవి ఫ్లోర్ ​మిల్,  కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పర్ణిక ప్యాలెస్ హోటల్,  వైష్ణవి ఇంటర్నేషనల్ బార్ ​అండ్ ​రెస్టారెండ్​పై దాడు చేశారు. 

ఫ్లోర్ ​మిల్ అపరిశుభ్రంగా ఉండగా.. రూ. 28 లక్షల విలువైన  42,500 కిలోల  శనగ పిండిని సీజ్ ​చేశారు.  శాంపిల్స్ ​సేకరించి టెస్టుకు పంపారు. ఓనర్ కు నోటీసు ఇచ్చారు.  కామారెడ్డి హైవే పక్కన పర్ణిక ప్యాలెస్ హోటల్​ స్టోర్​ రూమ్​లో  రూ.45వేల విలువైన  గడువు తీరిన ఆహార సామగ్రితో పాటు టౌన్ లోని వైష్ణవి ఇంటర్నేషనల్ బార్ ​అండ్​ రెస్టారెండ్​ హోటల్​లో  రూ.17వేల విలువైన ఆహార వస్తువులను ధ్వంసం చేయించారు.  

2 హోటల్స్​లోని కిచెన్లు అపరిశుభ్రంగా ఉండటం,  వాడిన నూనెను మళ్లీ వాడటం, దుమ్ము ధూళి పేరుకుపోవటం, స్టాప్​ హేయిర్ ​క్యాప్స్​, గ్లోవ్స్​ వాడడం లేదని గుర్తించి నిర్వాహకులకు నోటీసులు ఇచ్చినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.