
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలోని హోటల్స్, ఫ్లోర్ మిల్పై స్టేట్ఫుడ్ సేఫ్టీ టాస్క్ఫోర్స్ టీమ్ మంగళవారం (జూన్ 10) దాడి చేసి.. రూ. 28 లక్షల విలువైన శనగ పిండిని సీజ్ చేసింది. రూ. 62 వేల విలువైన గడువు తీరిన ఆహార సామగ్రిని ధ్వంసం చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. స్టేట్ ఫుడ్సేఫ్టీ ఉన్నతాధికారులు, ఐపీఎం డైరెక్టర్శివలీల ఆదేశాలతో స్టేట్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ఫోర్స్ టీమ్ హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి ఆధ్వర్యంలో పుడ్ ఇన్ స్పెక్టర్లు పి.రోహిత్రెడ్డి, ఎస్. శ్రీషిక, పి.స్వాతి, ఎన్. జగన్నాథ్ టీమ్ రామారెడ్డి మండలం పోశానిపేటలోని వైష్ణవి ఫ్లోర్ మిల్, కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పర్ణిక ప్యాలెస్ హోటల్, వైష్ణవి ఇంటర్నేషనల్ బార్ అండ్ రెస్టారెండ్పై దాడు చేశారు.
ఫ్లోర్ మిల్ అపరిశుభ్రంగా ఉండగా.. రూ. 28 లక్షల విలువైన 42,500 కిలోల శనగ పిండిని సీజ్ చేశారు. శాంపిల్స్ సేకరించి టెస్టుకు పంపారు. ఓనర్ కు నోటీసు ఇచ్చారు. కామారెడ్డి హైవే పక్కన పర్ణిక ప్యాలెస్ హోటల్ స్టోర్ రూమ్లో రూ.45వేల విలువైన గడువు తీరిన ఆహార సామగ్రితో పాటు టౌన్ లోని వైష్ణవి ఇంటర్నేషనల్ బార్ అండ్ రెస్టారెండ్ హోటల్లో రూ.17వేల విలువైన ఆహార వస్తువులను ధ్వంసం చేయించారు.
2 హోటల్స్లోని కిచెన్లు అపరిశుభ్రంగా ఉండటం, వాడిన నూనెను మళ్లీ వాడటం, దుమ్ము ధూళి పేరుకుపోవటం, స్టాప్ హేయిర్ క్యాప్స్, గ్లోవ్స్ వాడడం లేదని గుర్తించి నిర్వాహకులకు నోటీసులు ఇచ్చినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.