శంషాబాద్, వెలుగు: పేపర్ల లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర సర్కారు చెలగాటమాడుతుందని యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బైతి శ్రీధర్ అన్నారు. బుధవారం ఆయన గడపగడపకు బీజేపీ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండలం కవ్వగూడలో కార్యకర్తలు, నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు.
ఈ సందర్భంగా బైతి శ్రీధర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని ప్రజలే చెబుతున్నారని అన్నారు. సిలిండర్పై కేంద్ర ప్రభుత్వం రూ.300 తగ్గించిందని రాష్ట్ర ప్రభుత్వం ఎంత తగ్గిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు.