హైదరాబాద్: త్వరలోనే 4722 స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ మేరకు త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని మంత్రి చెప్పారు. గురువారం గాంధీ ఆసుపత్రిలో నిర్వహించిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఉత్తమ సేవలు అందించిన నర్సులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కరోనా సమయంలో నర్సుల సేవలు మరవలేనివన్నారు. కరోనా బారిన పడిన వాళ్లను కుటుంబ సభ్యులు వదిలేస్తే... వారిని నర్సులు అక్కున చేర్చుకొని కంటికి రెప్పలా కాపాడారని కొనియాడారు. అలాంటి నర్సులను గౌరవించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నేషనల్ నర్సెస్ డేను అధికారికంగా నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. త్వరలోనే వారికి ప్రమోషన్స్ కల్పిస్తామన్ని మంత్రి... నర్సింగ్ డైరెక్టరేట్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
మరిన్ని వార్తల కోసం...