పోలీసింగ్ లో మనమే నెంబర్ వన్..హోం మినిస్టర్ మహమూద్ అలీ

పోలీసింగ్ లో మనమే నెంబర్ వన్..హోం మినిస్టర్ మహమూద్ అలీ

వనపర్తి, వెలుగు:  పోలీసింగ్ లో తెలంగాణ పోలీసులు నెంబర్ వన్ సేవలు అందిస్తున్నారని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ అలీ ప్రసంశలు కురిపించారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలో రూ.32 కోట్ల తో కొత్తగా నిర్మించిన  ఎస్పీ ఆఫీసును మంత్రి నిరంజన్ రెడ్డి, డీజీపీ అంజనీ కుమార్ తో కలిసి హోం మంత్రి ప్రారంభించారు.  

మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ 250 ఎకరాల భూమి సేకరించి వనపర్తిలో ఒకేచోట ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలు నిర్మించామన్నారు. కార్యక్రమంలో   డీసీపీ షహనావాజ్ ఖాసీం, పోలీసు హౌసింగ్ సొసైటీ చైర్మన్ కోలేటీ దామోదర్ గుప్త, జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ రక్షిత మూర్తి పాల్గొన్నారు.