- ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి
- రాష్ట్ర జూడో చైర్మన్ మెట్టు సాయికుమార్
ఓల్డ్సిటీ, వెలుగు: జాతీయ జూడో చాంపియన్షిప్కు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు రాష్ట్ర జూడో అసోసియేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తెలిపారు. శుక్రవారం ఫిషిరీస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్బీ స్టేడియంలో ఈ నెల 16 నుంచి 20 వరకు జూడో జాతీయ సబ్ జూనియర్ చాంపియన్షిప్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు.
39 రాష్ట్రాల నుంచి 750 మంది ప్లేయర్లు పాల్గొంటున్నట్లు వెల్లడించారు. లాల్ బహదూర్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ జూడో అసోసియేషన్ అధ్యక్షుడు బైరబోయిన కైలాశ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి ఎంఏ.అజీజ్ ఫరూఖి, టెక్నికల్ చైర్మన్ రాము, అస్లాం, ముజాఫర్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
