కేంద్రం ఎస్టీ రిజర్వేషన్ బిల్లును వెంటనే పాస్ చేయాలె

కేంద్రం ఎస్టీ రిజర్వేషన్ బిల్లును వెంటనే పాస్ చేయాలె

హైదరాబాద్: గిరిజనుల హక్కుల కోసం బీఎస్పీ నిరంతరం పోరాటం చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ చౌహాన్ అన్నారు. ఆదివారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో  చేపట్టిన ఓ కార్యక్రమంలో వెంకటేశ్ చౌహాన్ మాట్లాడుతూ... కొన్నేళ్లుగా గిరిజన సమాజం చేస్తున్న పోరాటానికి తలొగ్గే సీఎం కేసీఆర్ 10 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. గిరిజన రిజర్వేషన్లపై కేసీఆర్ ప్రకటనను తాము స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అయితే రిజర్వేషన్లు అమలు చేసేవరకు తమ పోరాటం కొనసాగుతుందని  స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసిన పంపిన గిరిజన రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఆమోదించకపోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆ బిల్లును వెంటనే ఆమోదించాలని వెంకటేశ్ చౌహాన్ డిమాండ్ చేశారు.