317 జీవోను ఎత్తివేయాలంటూ స్టేట్ స్పౌస్ ఫోరమ్ డిమాండ్

317 జీవోను ఎత్తివేయాలంటూ స్టేట్ స్పౌస్ ఫోరమ్ డిమాండ్

హైదరాబాద్: 317 జీవోను ఎత్తివేయాలంటూ స్టేట్ స్పౌస్ ఫోరమ్ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం హైదర్ గూడలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. 317 జీవో కారణంగా భార్యా భర్తలు వేరు వేరు జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మానసిక ఒత్తిడి వల్ల అనారోగ్యాలకు గురవుతున్నామని ఉపాధ్యాయులు చెప్పారు. భార్యా భర్తలకు ఒకే జిల్లాలో పోస్టింగ్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశాలను జారీ చేసినప్పటికీ... అధికారులు అవేమీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటివరకు 19 జిల్లాల్లో బదిలీలు జరగ్గా...13 జిల్లాలలో సీఎం ఆదేశాలను అమలు చేయడంలేదని తెలిపారు.

భార్యాభర్తలు వేరు వేరుగా దూరప్రాంతాల్లో విధులు నిర్వహించడం వల్ల తమ పిల్లలను చూసుకోవడం, వారి చదువులకు కష్టంగా మారిందని అన్నారు. ఈ విషయమై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. దీపావళి పండుగలోగా  భార్యాభర్తలను ఒకే జిల్లాకు కేటాయించి తమ కుటుంబాలలో వెలుగులు నింపాలని స్టేట్ స్పౌస్ ఫోరమ్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.