మంచిర్యాల/కాగజ్ నగర్/భైంసా/ఆదిలాబాద్టౌన్/కోల్బెల్ట్, వెలుగు: రాష్ట్రావ్యాప్తంగా జరిగిన ట్రాన్స్ఫర్లలో భాగంగా ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న పలువురు మున్సిపల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఉన్న కె.సంపత్ కుమార్ వేములవాడకు బదిలీ కాగా, అక్కడ పనిచేస్తున్న జి.అన్వేశ్ మంచిర్యాల కమిషనర్గా నియమితులయ్యారు. బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేశ్ను ములుగు కమిషనర్గా బదిలీ చేసి ములుగులో పనిచేస్తున్న జె.సంపత్ను ఇక్కడ నియమించారు.
రామగుండం మున్సిపల్ కమిషనర్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ఈ మారుతి ప్రసాద్ను క్యాతనపల్లి కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చి, ఇక్కడ పనిచేస్తున్న జి.రాజును ఆదిలాబాద్ కమిషనర్గా ట్రాన్స్ఫర్ చేశారు. కాగజ్ నగర్ మున్సిపాలిటీ కమిషనర్గా బట్టు తిరుపతి నియమితులయ్యారు. కోరుట్ల మున్సిపల్ కమిషనర్గా పని చేస్తున్న తిరుపతిని ఇక్కడికి బదిలీ చేశారు. నిర్మల్ జిల్లా భైంసా మున్సిపల్ కమిషనర్గా ఖాజా మొహినోద్దీన్నియమితులయ్యారు.
