బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు 

బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు 

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవద్దని కోట్ల రూపాయల ఆశ చూపారని, అయినా తాను లొంగిపోలేదని వ్యాఖ్యానించారు.

తాను ఎల్లప్పుడూ నియోజకవర్గం ప్రజల మధ్యనే ఉంటానని చెప్పారు. తన సమాధి కూడా స్టేషన్ ఘన్ పూర్ లోనే ఉంటుందన్నారు. తమ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని తెలిపారు. ఎమ్మెల్యే రాజయ్య చేసిన కామెంట్స్.. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.