ధైర్యంగా ఉండండి.. కరోనాపై పోరాడదాం

ధైర్యంగా ఉండండి.. కరోనాపై పోరాడదాం

కరోనా వైరస్‌ తో ధైర్యం గా పోరాడదామని టీమిండియా కెప్టెన్ విరాట్ ​కోహ్లీ దేశ ప్రజలకు పిలుపునిచ్చాడు. ‘అన్ని ముందు జాగ్రత్తలు పాటించడంతో పాటు మనమంతా ధైర్యంగా ఉండి కరోనా వైరస్‌ పై పోరాడదాం. మీరంతా జాగ్రత్తగా, ధైర్యంగా ఉండండి. ముఖ్యంగా చికిత్సకంటే నివారణే అత్యుత్తమ మార్గం అని గుర్తుంచుకోండి’ అని కోహ్లీ శనివారం ట్వీట్‌ చేశాడు. మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ కూడా ప్రజలకు జాగ్రత్తలు చెప్పాడు. ‘వైరస్ ​వ్యాప్తి చెందకుండా ఎవరైతే అప్రమత్తంగా ఉంటారో..వారు మిగిలిన వారిని కాపాడినట్టే. ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ఉండండి. జాగ్రత్తలు పాటించండి. ఏమాత్రం అనుమానం వచ్చినా టెస్ట్​ చేయించుకోండి.నిర్ధారణ అయితే సరైన చికిత్స తీసుకుని ఇతరులకు సోకకుండా జాగ్రత్త పడండి. అందరం కలిస్తే త్వరలోనే ఈ వైరస్​ను నివారించగలం ’ అని ట్వీట్ చేశాడు.