ములకలపల్లి, వెలుగు: పీహెచ్ సీలోని కరెంట్ మీటర్మార్చాలంటూ గుర్తుతెలియని వ్యక్తి భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు చెందిన మెడికల్ ఆఫీసర్కు ఫోన్ చేసి రూ.6వేలు కొట్టేశాడు. పోలీసులు, బాధిత ఆఫీసర్ తెలిపిన వివరాల ప్రకారం.. ములకలపల్లి మండలంలోని మంగపేట పీహెచ్ సీ కరెంట్ మీటర్ స్ట్రక్ అయ్యిందని, మార్చేందుకు డీడీ తీయాలని 3 రోజుల కింద గుర్తుతెలియని వ్యక్తి మెడికల్ ఆఫీసర్ ఉదయలక్ష్మికి ఫోన్ చేసి చెప్పాడు.
అందుకు డీఎంహెచ్ఓ పర్మిషన్ తీసుకోవాలని ఆఫీసర్ చెప్పారు. ఆ వెంటనే గుర్తుతెలియని వ్యక్తి మరో వ్యక్తికి కాన్ఫరెన్స్పెట్టి డీఎంహెచ్ఓ అని ఉదయలక్ష్మిని నమ్మించాడు. దాంతో అతను సూచించిన నంబర్కు ఆఫీసర్ ఉదయలక్ష్మి రూ.5,800 ఫోన్పే చేశారు. మూడు రోజులు దాటినా మీటర్ మార్చకపోవడంతో డౌట్వచ్చి విద్యుత్ శాఖ ఏఈ లక్ష్మీనరసింహరావును సంప్రదించగా మోసపోయినట్లు తెలిసింది. బాధిత ఆఫీసర్ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.