మీటర్ మార్చాలంటూ రూ.6వేలు కొట్టేసిండు

మీటర్ మార్చాలంటూ రూ.6వేలు కొట్టేసిండు

ములకలపల్లి, వెలుగు: పీహెచ్ సీలోని కరెంట్​ మీటర్​మార్చాలంటూ గుర్తుతెలియని వ్యక్తి భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు చెందిన మెడికల్​ ఆఫీసర్​కు ఫోన్ చేసి రూ.6వేలు కొట్టేశాడు. పోలీసులు, బాధిత ఆఫీసర్​ తెలిపిన వివరాల ప్రకారం.. ములకలపల్లి మండలంలోని మంగపేట పీహెచ్ సీ కరెంట్​ మీటర్ స్ట్రక్​ అయ్యిందని, మార్చేందుకు డీడీ తీయాలని 3 రోజుల కింద గుర్తుతెలియని వ్యక్తి మెడికల్ ఆఫీసర్ ​ఉదయలక్ష్మికి ఫోన్​ చేసి చెప్పాడు.

అందుకు డీఎంహెచ్ఓ పర్మిషన్​ తీసుకోవాలని ఆఫీసర్​ చెప్పారు. ఆ వెంటనే గుర్తుతెలియని వ్యక్తి మరో వ్యక్తికి కాన్ఫరెన్స్​పెట్టి డీఎంహెచ్ఓ అని ఉదయలక్ష్మిని నమ్మించాడు. దాంతో అతను సూచించిన నంబర్​కు ఆఫీసర్ ​ఉదయలక్ష్మి రూ.5,800 ఫోన్​పే చేశారు. మూడు రోజులు దాటినా మీటర్​ మార్చకపోవడంతో డౌట్​వచ్చి విద్యుత్ శాఖ ఏఈ లక్ష్మీనరసింహరావును సంప్రదించగా మోసపోయినట్లు తెలిసింది. బాధిత ఆఫీసర్ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.