వీధి కుక్కల స్వైర విహారం.. 8 మందికి గాయాలు

వీధి కుక్కల స్వైర విహారం.. 8 మందికి గాయాలు

జనగామ జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. చిన్న పిల్లలు, పెద్దవాళ్లు  అనే తేడా లేకుండా దాడి చేస్తున్నాయి. దబ్బగుంటపల్లిలో 8 మందిని గాయపరిచాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. 

బచ్చన్నపేట మండలం దబ్బగుంటపల్లిలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గ్రామంలో వరుసగా 8 మందిపై దాడి చేశాయి. గాయపడిని వారందరిని చికిత్స నిమిత్తం బచ్చన్నపేట ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో వీధి కుక్కలు ఎక్కువయ్యాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో రోడ్లపైకి ఒంటరిగా రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. వెంటనే కుక్కల దాడిని అరికట్టడానికి నియంత్రణ చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను కోరారు.