కరీంనగర్ సిటీలో ఫుట్‌‌పాత్‌‌లు ఆక్రమిస్తే చర్యలు : మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్‌ ‌దేశాయ్

కరీంనగర్ సిటీలో ఫుట్‌‌పాత్‌‌లు ఆక్రమిస్తే చర్యలు : మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్‌ ‌దేశాయ్

కరీంనగర్ టౌన్,వెలుగు: సిటీలో రోడ్లవెంబడి ఫుట్‌‌పాత్‌‌లను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్‌ ‌దేశాయ్ హెచ్చరించారు. 100 రోజుల  ప్రణాళికలో భాగంగా గురువారం సిటీలోని మెయిన్ రోడ్ల వెంబడి ఫుట్‌‌పాత్‌‌లను, జంక్షన్లను, డివిజన్లలోని శానిటేషన్‌‌ పనులను కమిషనర్‌‌‌‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా కరీంనగర్‌‌‌‌ను మార్చుకుందామని పిలుపునిచ్చారు.

అనంతరం పలు షాపులను పరిశీలించి, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌‌ను వాడొద్దని సూచించారు. డీఆర్ఎఫ్​ టీం, శానిటేషన్‌‌ సిబ్బందితో కలిసి రోడ్లను ఆక్రమించి నిర్వహిస్తున్న షాపులను తొలగించారు. వివిధ కూడళ్లలోని హైలాండ్ జంక్షన్లను తనిఖీ చేశారు. ఆయన వెంట డిప్యూటీ కమిషనర్ వేణుమాధవ్, స్వామి పాల్గొన్నారు.