యానాంలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

యానాంలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

యానాం నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘింస్తే కఠిన చర్యలు తప్పవని పరిపాలన అధికారి శివ శివరాజ్ మీనా తెలిపారు. బుధవారం నుండి యానాంలోని నిబంధనలు ఉల్లంఘించిన వారికి మున్సిపాలిటీ, పోలీస్, రెవెన్యూ శాఖల సిబ్బంది రూ 100 రూపాయల పెనాల్టీ విధించడం జరుగుతుందన్నారు. సామాజిక దూరం పాటించాలని బైక్ పై ఒక వ్యక్తి.. కారు పై ఇద్దరు మాత్రమే ప్రయాణించాలన్నారు. తప్పనిసరి అయితేనే వాహనాలపై వెళ్లాలని సూచించారు. ఈ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.