రోడ్డెక్కిన నిజాం కాలేజీ స్టూడెంట్లు

రోడ్డెక్కిన నిజాం కాలేజీ స్టూడెంట్లు

బషీర్​బాగ్, వెలుగు: బషీర్​బాగ్​లోని హాస్టల్ లో ఫుడ్డు సరిగ్గా పెట్టడం లేదని నిజాం కాలేజీ స్టూడెంట్లు మంగళవారం రోడ్డెక్కారు. హాస్టల్​లో మౌలిక సదుపాయాలు కల్పించి, సరైన ఫుడ్డు అందించాలని డిమాండ్ చేశారు. హాస్టల్ గేట్ ముందు బైఠాయించి, నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపైనే అన్నం, కూరలు పెట్టుకొని నిరసన తెలిపారు. కొన్ని రోజులుగా నాణ్యమైన ఆహారం అందించడం లేదని, నాసిరకం భోజనం పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్డు విషయంలో ప్రిన్సిపాల్ తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. స్టూడెంట్ల నిరసనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న సైఫాబాద్ పోలీసులు అక్కడికి చేరుకుని, బలవంతంగా స్టూడెంట్లను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, స్టూడెంట్ల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. చివరికి పోలీసులు వారికి సర్దిచెప్పి ఆందోళనను విరమింపజేశారు.