ఫోన్​ కొనివ్వలేదని  స్టూడెంట్ సూసైడ్​

ఫోన్​ కొనివ్వలేదని  స్టూడెంట్ సూసైడ్​


మెదక్/నర్సాపూర్, వెలుగు: ఫోన్​ కొనివ్వలేదని 9వ తరగతి స్టూడెంట్​సూసైడ్ చేసుకున్నాడు. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్​ జిల్లా నర్సాపూర్​టౌన్​శివాలయం వీధికి చెందిన గొట్టిపాముల భాగ్యలక్ష్మి కొడుకు సాయిరాం(16) హైదరాబాద్​హాస్టల్​లో ఉంటూ చదువుకునేవాడు. కరోనా కారణంగా హాస్టల్స్​మూతపడటంతో ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నాడు. కొద్ది రోజులుగా స్మార్ట్​ఫోన్​ కొనివ్వాలని తల్లిని అడుగుతున్నాడు. మంగళవారం ఉదయం కూడా ఫోన్​ కావాలని అడగగా జీతం వచ్చిన తరువాత కొనిస్తానని తల్లి చెప్పింది. కొద్దిసేపటి తర్వాత చూసేసరికి సాయిరాం ఇంట్లోని ఓ రూంలోకి వెళ్లి చున్నీతో ఫ్యాన్​కు ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్​కు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్​చెప్పారు.