కేఎంసీలో వైద్య విద్యార్థుల ధర్నా

కేఎంసీలో వైద్య విద్యార్థుల ధర్నా
  • రోడ్లు వేయాలని, వసతులు కల్పించాలని డిమాండ్

వరంగల్ సిటీ, వెలుగు : కాకతీయ మెడికల్  కాలేజీ పరిధిలో  రోడ్లను  బాగు చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  స్టూడెంట్లు గురువారం ఆందోళన చేశారు.  ర్యాలీ గా వెళ్లి,  ప్రిన్సిపాల్​ మోహన్​దాస్​ ను కలిశారు.  ఈ సందర్భంగా జూనియర్​ డాక్టర్ల సంఘం జాయింట్​ సెక్రటరీ నవదీప్ మాట్లాడుతూ రోడ్డు గుంతలు తేలి ఉండటంతో వాహనాలు కిందపడి ముగ్గరు విద్యార్థులకు గాయాలు అయినట్లు చెప్పారు.

ఇందులో    విద్యార్థులు ఉంటున్న హాస్టల్​లో  కూడా  అనేక ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. వీధి దీపాలు ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు. వైద్య విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇటీవల   కలెక్టర్ ను కూడా కలిసి వివరించినట్లు తెలిపారు.  సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళన పెద్ద ఎత్తున నిర్వహిస్తామని హెచ్చరించారు.  విద్యార్థుల సమస్యలను డైరెక్టర్​ ఆఫ్​ మెడికల్​ ఎడ్యూకేషన్​ కు వివరించినట్లు కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ ​ మోహన్​దాస్ తెలిపారు. మంత్రులకు విషయం చెప్పానని, త్వరలోనే సమస్యలు తీరుతాయని ఆయన తెలిపారు.