వీళ్లకెందుకు చదువు : ఫీజు అడిగారని.. టీచర్​ను కాల్చిన స్టూడెంట్స్​...

వీళ్లకెందుకు చదువు : ఫీజు అడిగారని.. టీచర్​ను కాల్చిన స్టూడెంట్స్​...

ట్యూషన్​ ఫీజు అడిగారనే కారణంతో ఇద్దరు స్టూడెంట్స్​ఏకంగా టీచర్​నే మట్టుబెట్టాలని చూసిన ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొరేనా జిల్లాలోని జౌరా రోడ్డు పక్కన గిర్ వర్​ సింగ్​కుహ్​వహా అనే టీచర్​ కోచింగ్​ సెంటర్​ నడుపుతున్నారు. అదే కోచింగ్​సెంటర్​కి చెందిన పూర్వ విద్యార్థులు ఇద్దరు రెండు సంవత్సరాల ఫీజు బకాయి ఉన్నారు. ఫీజు కట్టాలని టీచర్​ తరచూ అడుగుతుండటంతో పగ పెంచుకున్నారు.

టీచర్ని మట్టుబెట్టాలని స్టూడెంట్స్​ నిర్ణయించుకున్నారు. స్థానికంగా ఉన్న మైదా ఫ్యాక్టరీ వద్ద టీచర్ ఉన్నట్లు గమనించారు. అనంతరం తాము వెంట తెచ్చుకున్న గన్​తో టీచర్​పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు టీచర్​ను గ్వాలియర్​లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  నేరానికి సంబంధించిన విజువల్స్​ సీసీ కెమెరాల్లో రికార్డ్​ అయ్యాయి. వాటిని సేకరించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన  స్థానికంగా సంచలనం సృష్టించింది.