ట్యూషన్ ఫీజు అడిగారనే కారణంతో ఇద్దరు స్టూడెంట్స్ఏకంగా టీచర్నే మట్టుబెట్టాలని చూసిన ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొరేనా జిల్లాలోని జౌరా రోడ్డు పక్కన గిర్ వర్ సింగ్కుహ్వహా అనే టీచర్ కోచింగ్ సెంటర్ నడుపుతున్నారు. అదే కోచింగ్సెంటర్కి చెందిన పూర్వ విద్యార్థులు ఇద్దరు రెండు సంవత్సరాల ఫీజు బకాయి ఉన్నారు. ఫీజు కట్టాలని టీచర్ తరచూ అడుగుతుండటంతో పగ పెంచుకున్నారు.
టీచర్ని మట్టుబెట్టాలని స్టూడెంట్స్ నిర్ణయించుకున్నారు. స్థానికంగా ఉన్న మైదా ఫ్యాక్టరీ వద్ద టీచర్ ఉన్నట్లు గమనించారు. అనంతరం తాము వెంట తెచ్చుకున్న గన్తో టీచర్పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు టీచర్ను గ్వాలియర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నేరానికి సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. వాటిని సేకరించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.