హైదరాబాద్, వెలుగు : పూటకు రూ.10 ఇస్తే భోజనం ఎలా వస్తుందని సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన ధరల ప్రకారం మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హైదరాబాద్లోని బీసీ వెల్ఫేర్ ఆఫీస్ ముందు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. నిరసనకు సంఘం ప్రెసిడెంట్ ఆర్.కృష్ణయ్య సంఘీభావం తెలిపి మీడియాతో మాట్లాడారు. ప్రజాప్రతినిధుల జీతాలు పెంచుకుంటరు.. ఉద్యోగులు జీతాలు పెంచుతరు.. కానీ, స్కాలర్ షిప్ లు, మెస్ చార్జీలు పెంచరా అని నిలదీశారు. ఐదేండ్లుగా మెస్ చార్జీలు పెంచడం లేదని, పెరిగిన ధరల ప్రకారం 8 లక్షల మంది యూనివర్సిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్, గురుకుల కాలేజీ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ, డిగ్రీ కోర్సులు చదివే బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, సి.రాజేందర్, కృష్ణయాదవ్, అనంతయ్య, గజేందర్, తిరుపతి, నిఖిల్ పాల్గొన్నారు.
మెస్ చార్జీలు పెంచాలని హాస్టల్ స్టూడెంట్స్ ఆందోళన
- హైదరాబాద్
- February 23, 2022
లేటెస్ట్
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం
- పీఓకేను స్వాధీనం చేసుకుంటం: అమిత్ షా
- Federation Cup 2024: బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఖాతాలో స్వర్ణం
- T20 World Cup 2024: కోహ్లీతో జాగ్రత్త.. పాక్ ఆటగాళ్లను హెచ్చరించిన మాజీ కెప్టెన్
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కేసీఆర్ పిలుపు
- ఏందమ్మా ఇది... . దోమల బ్యాట్ను ఇలా కూడా వాడతారా..
- టెట్ పరీక్ష హాల్టికెట్ల విషయంలో గందరగోళం
- PBKS vs RR: పంజా విసిరిన పంజాబ్ బౌలర్లు.. ఎదుట స్వల్ప లక్ష్యం
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- టూర్లకు పోతున్న లీడర్లు
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- యాదాద్రి పవర్ ప్లాంట్ ఫస్ట్ ఫేజ్ షురూ