- విద్యార్థుల తల్లిదండ్రుల డిమాండ్
ముషీరాబాద్, వెలుగు : విదేశాల్లో చదువుకుంటున్న గిరిజన విద్యార్థులకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో నిరసన తెలిపారు.ఈ సందర్భగా వారు మాట్లాడుతూ.. విదేశీ స్కాలర్షిప్ అందించకుండా గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవాలని కోరారు.
అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ పొందడానికి ఉన్న నిబంధనలను ఈజీ చేయాలని కోరారు. స్టడీస్లో గ్యాప్వచ్చినోళ్లకు కూడా స్కాలర్షిప్ అందజేయాలని కోరారు. నిరసనలో తల్లిదండ్రులు, విద్యార్థులు బద్రీ నాయక్, భాస్కర్, రాంబాబు, వెంకట్, నవీన్, రాథోడ్, సుమన్, పాల్గొన్నారు.