
ఖమ్మం: రూ.30 వేల లంచం తీసుకుంటుండగా ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీ అధికా రులకు చిక్కారు. ఖమ్మం జిల్లా తల్లంపాడు గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే రైతుకు సంబంధించి రెండెకరాల వ్యవసాయభూ మిని వారి తల్లిదండ్రుల నుంచి గిఫ్టెడ్ చేసేందుకు.. రైతును సబ్ రిజిస్ట్రార్ అరుణ రూ. 50 వేలను స్టాంప్వెండర్ ద్వారా లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బాధిత రైతు ఏసీబీ అధికారులకు ఆశ్రయించగా.. రైతు నుంచి 30 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ అరుణను రెడ్డెండ్గా పట్టుకున్నారు.ఈ మేరకు రిజిస్ట్రార్ ఆఫీస్ లోనూ ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించిన్నట్లు తెలుస్తోంది.
గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ తనిఖీల్లో భారీగా ప్రభుత్వ అధికారులు,పోలీసులు లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కారు. ఎక్కువగా రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో పనిచేసే వాళ్లు, మున్సిపాలిటీ అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులే ఉండటం విశేషం.