
నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ పి.రవిశంకర్ తన కొడుకు అద్వయ్ని హీరోగా పరిచయం చేసేందుకు రెండోసారి మెగాఫోన్ పట్టారు. ‘సుబ్రహ్మణ్య’ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల నిర్మిస్తున్నారు. శనివారం ఈ మూవీ ప్రీ లుక్పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫాంటసీ వరల్డ్ను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. ఇప్పటికే అరవై శాతం షూటింగ్ పూర్తయింది. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముంబయిలో షారుఖ్కి చెందిన రెడ్ చిల్లీస్ స్టూడియోలో జరుగుతున్నాయి. విజువల్, ఎమోషనల్ ట్రీట్గా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నామని మేకర్స్ చెప్పారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది.