కుప్పకూలిన విమానం..9 మంది దుర్మరణం..మృతుల్లో నలుగురు సైనికులు

కుప్పకూలిన విమానం..9 మంది దుర్మరణం..మృతుల్లో నలుగురు సైనికులు

సాంకేతిక లోపంతో ఓ విమానం కుప్పకూలింది. ఈ  ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు.  మృతుల్లో నలుగురు సైనికులు ఉన్నారు. ఈ ఘటన సూడాన్​లోని పోర్ట్ సుడాన్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. 


 పౌరులతో వెళ్తున్న విమానం టేకాఫ్‌ సమయంలో సాంకేతిక లోపం తలెత్తి కూలినట్లు సూడాన్ సైన్యం వెల్లడించింది.  ఈ మాదంలో ఓ చిన్నారి మృత్యుంజయురాలిగా బయటపడిందని తెలిపింది.  ఈ ఘటన జరిగిన వెంటనే సహాయక బృందాలు ఆ ప్రాంతానికి చేరి రక్షణ చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించాయి.