సాంకేతిక లోపంతో ఓ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో నలుగురు సైనికులు ఉన్నారు. ఈ ఘటన సూడాన్లోని పోర్ట్ సుడాన్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది.
పౌరులతో వెళ్తున్న విమానం టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తి కూలినట్లు సూడాన్ సైన్యం వెల్లడించింది. ఈ మాదంలో ఓ చిన్నారి మృత్యుంజయురాలిగా బయటపడిందని తెలిపింది. ఈ ఘటన జరిగిన వెంటనే సహాయక బృందాలు ఆ ప్రాంతానికి చేరి రక్షణ చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించాయి.