హైవేలపై సడెన్ బ్రేక్ వేయడం నిర్లక్ష్యమే.. డ్రైవర్లను బాధ్యులుగా చేయాల్సిందే: సుప్రీం కోర్టు

హైవేలపై సడెన్ బ్రేక్ వేయడం నిర్లక్ష్యమే.. డ్రైవర్లను బాధ్యులుగా చేయాల్సిందే: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: హైవేలపై సడెన్‎గా బ్రేక్​ వేయడం ముమ్మాటికీ నిర్లక్ష్యంగానే పరిగణించాలని, దానికి డ్రైవర్లను బాధ్యులుగా చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఎలాంటి ఇండికేటర్​లేకుండా వాహనదారులు సడెన్​బ్రేక్​వేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. 2017 జనవరి 7న తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన ఇంజనీరింగ్​స్టూడెంట్​మహ్మద్​హకీమ్ దాఖలుచేసిన పిటిషన్‎పై జస్టిస్ సుధాంశు ధూలియా, జస్టిస్​అరవింద్ కుమార్‌‌‌‌‌‌‌‌తో కూడిన బెంచ్ విచారించింది. తాను బైక్‎తో రోడ్డుపై వెళ్తుండగా.. ముందున్న కారు డ్రైవర్ సడెన్‎గా బ్రేక్​ వేశాడని, దాంతో తాను అదుపుతప్పి పడిపోయానని హకీమ్​ చెప్పాడు. 

అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన బస్సు తనను ఢీకొందని చెప్పాడు. కారు డ్రైవర్​సడెన్‎గా బ్రేక్​వేయడం వల్లే తాను కాలు కోల్పోవాల్సి వచ్చిందని, తనకు న్యాయం చేయాలని అభ్యర్థించాడు. అయితే.. గర్భిణి అయిన తన భార్య కారులో వాంతులు చేసుకోవడంతో సడెన్‎గా బ్రేక్​ వేయాల్సి వచ్చిందని డ్రైవర్​తెలిపాడు. దీనిపై సుప్రీంకోర్టు బెంచ్​స్పందిస్తూ.. ‘‘హైవేలపై వెహికల్స్ స్పీడ్‏గా వెళ్తుంటాయి. ముందువెళ్తున్న వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే.. వెనక వచ్చే వారికి ప్రమాదమే కదా?! సడెన్​ బ్రేక్​వేయడం ముమ్మాటికీ నిర్లక్ష్యమే. హకీమ్‎కు పరిహారం ఇవ్వాల్సిందే” అని ఇన్సూరెన్స్ కంపెనీలకు కోర్టు స్పష్టం చేసింది.