
సన్నీ అఖిల్ హీరోగా అభ్యుదయ చిత్రాల దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్థన్ నిర్మించిన చిత్రం ‘పోలీస్ వారి హెచ్చరిక’. తాజాగా ఈ చిత్రం టీజర్ను విడుదల చేశారు.
టీజర్ను లాంచ్ చేసిన హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ ‘దర్శకుడు బాబ్జీ.. కృష్ణ గారికి బాగా దగ్గరివాడు. ఆయన అభిమానులకు సుపరిచితుడు. ఇక టీజర్ అంటే.. రక రకాల వ్యాపకాలతో, రకరకాల మూడ్స్తో ఉండే ప్రేక్షకులను చిటికె వేసి మనవైపుకు తిప్పుకునే ఓ అస్త్రం. ఈ మూవీ టీజర్ కూడా అలాంటి అస్త్రంలా ఆకర్షణీయంగా ఉంది’అంటూ బెస్ట్ విషెస్ చెప్పాడు.
తన సినిమాలకు సంబంధించి ఏదో ఒక కార్యక్రమాన్ని కృష్ణ గారి చేతులమీదుగా చేయించేవాడినని, ఈ టీజర్ లాంచ్తో ఆ లోటును సుధీర్ బాబు తీర్చారని దర్శకుడు బాబ్జి చెప్పారు. నిర్మాత బెల్లి జనార్థన్, హీరో సన్నీ అఖిల్ తదితరులు పాల్గొన్నారు.