క్రష్షింగ్ ప్రారంభించాలని  చెరుకు రైతుల  ధర్నా

క్రష్షింగ్ ప్రారంభించాలని  చెరుకు రైతుల  ధర్నా

సంగారెడ్డి కలెక్టర్  కార్యాలయం  ముందు  చెరుకు రైతులు  ధర్నా చేశారు. గణపతి  షుగర్ ఫ్యాక్టరీ లో  క్రష్షింగ్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు.  అంతకుముందు సంగారెడ్డిలో భారీ ర్యాలీ తీశారు రైతులు. గణపతి షుగర్  పరిశ్రమ కార్మికుల సమ్మెతో  తాము  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. యాజమాన్య మొండి వైఖరి కారణంగా కార్మికులు సమ్మెకు దిగారని.. అది తమకు  ఇబ్బందిగా మారిందన్నారు  రైతులు. వెంటనే  పరిశ్రమ ప్రారంభించి.. 4500  రూపాయల మద్దతు  ధర ఇచ్చి  పంట కొనాలని  డిమాండ్ చేశారు.