మావాళ్లు చనిపోతున్నారంటూ ఫోన్.. వెళ్లి చూస్తే

మావాళ్లు చనిపోతున్నారంటూ ఫోన్.. వెళ్లి చూస్తే
  • సికింద్రాబాద్ బోయిన్ పల్లి పోలీసులకు సమాచారం
  • మనోవికాస్ నగర్ లో ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యాయత్నం
  • ఇద్దరు మృతి.. మరొకరి పరిస్థితి సీరియస్

సికింద్రాబాద్: మా వాళ్లు చనిపోతున్నారు.. కాపాడమంటూ బోయిన్ పల్లి పోలీసులకు గురువారం ఫోన్ కాల్ వచ్చింది. పోలీసులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించి బోయిన్ పల్లి పరిధిలోని మనోవికాస్ నగర్ కు వెళ్లి చూడగా.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేసినట్లు కనిపించింది. అప్పటికే అపస్మారక పరిస్థితుల్లో కనిపించిన ముగ్గురిని పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి తల్లీ, కూతురు మృతి చెందగా.. తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. తండ్రిని బతికించేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. తమ తల్లిదండ్రులు, సోదరి ఆత్మహత్యయత్నం చేయడం తెలిసి మరో కూతురు, కొడుకు కన్నీరుమున్నీరుగా విలపించడం విషాదం రేపింది. 
ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. బోయిన్పల్లి పోలీసుల కథనం ప్రకారం విజయ్ బాటియా(40) తన భార్య స్నేహ బాటియా(38).. కూతురు హన్సిక బాటియా(15) తో కలసి ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు వెళ్లే సరికే ఘోరం జరిగిపోయింది. అందరూ కలసి ఆత్మహత్యాయత్నం చేసినట్లు కనిపించడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. తల్లి స్నేహ భాటియా (38), కూతురు హన్సిక భాటియా(15) మృతి చెందగా.. తండ్రి విజయ్ భాటియా (40) పరిస్థితి విషమంగా ఉంది. మరో కూతురు వస్సిక బాటియా.. కొడుకు కలిసి బంధువులకి సమాచారం ఇవ్వడంతో విషయం తెలుసుకున్న పోలీసులు  సంఘటన స్థలానికి చేరుకున్నారు. గురువారం మధ్యాహ్నం సమయంలోనే వీరు అఘాయిత్యానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.