అత్తింటి వేధింపులతో ఆత్మహత్య

అత్తింటి వేధింపులతో ఆత్మహత్య

జవహర్ నగర్ లోని ఇంట్లో ఉరేసుకున్న గర్భిణి

జవహర్ నగర్, వెలుగు: భర్త, అత్తమామల వేధింపులు తట్టుకోలేక గర్భిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన జవహర్ నగర్ పీఎస్ పరిధి లో జరిగింది . ఎస్సై అబ్దుల్ హయూమ్ వివరాల ప్రకారం..శివాజీనగర్ లోని హనుమాన్ టెంపుల్ వద్ద ఉండే కనుజుల బాలక్రిష్ణకి సరిత(26)తో 2013
నవంబర్ లో పెళ్లైంది. ఈ దంపతులకు కూతురు రిత్వి క(2) ఉంది. ప్రస్తుతం సరిత 7 నెలల గర్భిణి. బాలక్రిష్ణ కొం తకాలంగా తాగి వచ్చి రోజూ కట్నం తీసుకురావాలని సరితను వేధిస్తున్నాడు.

సరిత పుట్టింటికి వారికి విషయం చెప్పడంతో కుటుంబ సభ్యులు పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి బాలక్రిష్ణను మందలించారు. అయినా పద్ధతి మార్చుకోని బాలక్రిష్ణ, అతడి తల్లిదండ్రులు సరితను మళ్లీ వేధించడం మొదలుపెట్టారు. ఈ వేధింపులు తట్టుకోలేక గర్భిణి సరిత శనివారం కిచెన్ రూమ్ లో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సరిత అన్న దామెర క్రిష్ణమూర్తికి జవహర్ నగర్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.